అందాల తార కైరా అద్వానీ నట ప్రయాణం మహా జోరుగా సాగుతోంది. ఈ భామ బాలీవుడ్తో పాటు ప్రాంతీయ పరిశ్రమల్లోనూ ఆసక్తికర చిత్రాలు దక్కించుకుంటోంది. ఇవీ గాక నెట్ ధారావాహికల్లోనూ తీరిక లేకుండా నటిస్తోంది. ఎంఎస్ ధోనీ, మెషీన్ లాంటి చిత్రాల్లో మెరిసిన ఈ సుందరి..తెలుగులోకి వచ్చి స్టార్లకు జోడీ అయ్యింది. మహేష్తో భరత్ అనే నేను మంచి విజయాన్ని అందించ గా…ఇప్పుడు చరణ్తో బోయపాటి రూపొందిస్తున్న వినయ విధేయ రామ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో తన పాత్ర చిత్రీకరణ పూర్తి చేసుకుని ముంబై వెళ్లింది. అక్కడ గుడ్ న్యూస్ అనే సినిమా షూటింగ్లో అడుగు పెట్టింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కరీనా కపూర్ లాంటి పేరున్న తారలు నటిస్తున్నారు.
వీళ్లతో కలిసి నటించడం మంచి అనుభవంగా కైరా చెప్పుకుంటోంది. తారలను, సినిమా రూపకల్పనలో వాళ్లు పడే కష్టాన్ని తక్కువగా చూడద్దంటోందీ నాయిక. కైరా మాట్లాడుతూ….సినిమా తారల పని సులువు అని చూసేవాళ్లు అనుకుంటారు. మాకు జుట్టు ఒకరు దువ్వితే, అలంకరణ మరొకరు చేస్తారు. అలా కెమెరా ముందుకు వెళ్లి డైలాగ్ చెప్పి వస్తే చాలు అనుకుంటారు. కానీ మానసికంగా, శారీరకంగా మేము ఎంత సంసిద్ధంగా ఉంటే నటించగలమో మాకు తెలుసు. కాస్త నిలకడ తప్పినా పాత్రలో కోరుకున్న భావోద్వేగాలు పలికించలేం. నేను నటిగా మారిన తర్వాత ఎంతో క్రమశిక్షణ అలవర్చుకున్నాను. అని చెప్పింది. ప్రస్తుతం గుడ్ న్యూస్ చిత్రంతో పాటు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్లోనూ కైరా నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa