ధృవన్ కటకం, నియా త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం "బలమెవ్వడు". సత్య రాచకొండ ఈ సినిమాకు డైరెక్టర్. శ్రీజయ గోదావరి చిత్రాలయ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సత్యప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. సుహాసిని మణిరత్నం, పృథ్విరాజ్, నాసర్ కీలకపాత్రలు పోషించారు. పోతే, ఈ మూవీ రేపే థియేటర్లలో విడుదల కాబోతుంది. విభిన్న కధాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.