“అంతర్జాతీయ జలాల్లో ఉన్నాం కాబట్టి సురక్షితమేననుకున్నారు. కానీ ఒక టార్పెడో దాడితో నౌక సముద్రగర్భంలో కలిసిపోయింది” అని హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌకను ముంచేశామని అమెరికా రక్షణ మంత్రి Pete Hegseth ప్రకటించారు.అయితే, ముంచేశామని చెప్పిన ఆ ఇరాన్ నౌక ఏదన్నది మాత్రం ఆయన స్పష్టం చేయలేదు.ఇక దీనికి ముందు, ఇరాన్కు చెందిన ‘ఐఆర్ఐఎస్ దేనా’ నౌక తమ సముద్ర జలాల్లో మునిగిపోయిందని శ్రీలంక వెల్లడించింది. ఆ నౌకలో ఉన్న సుమారు 140 మంది సిబ్బంది గల్లంతయ్యారని తెలిపింది. వారిని రక్షించేందుకు నౌకాదళం, వైమానిక దళాన్ని వెంటనే రంగంలోకి దించినట్టు పేర్కొంది.శ్రీలంక విదేశాంగ మంత్రి Vijitha Herath పార్లమెంటులో మాట్లాడుతూ, తెల్లవారుజామున ఆ నౌక నుంచి అత్యవసర సంకేతం అందిందన్నారు.గాలె ఓడరేవుకు దాదాపు 40 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. నౌకలో సుమారు 180 మంది ఉన్నారని అంచనా. గాయపడిన 32 మందిని గాలె ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు.అమెరికా రక్షణ మంత్రి చేసిన ప్రకటన తప్ప, నౌక మునిగిపోవడానికి ఖచ్చితమైన కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.శ్రీలంక నేవీ ప్రతినిధి బుద్ధిక సంపత్ మాట్లాడుతూ, “ఈ సంఘటన మా ప్రాదేశిక జలాలకు బయటే జరిగింది. అయినప్పటికీ, అది మా రీసర్చ్ అండ్ డిఫెన్స్ జోన్ పరిధిలో ఉండటంతో అంతర్జాతీయ బాధ్యతల మేరకు చర్యలు చేపట్టాం” అన్నారు.“సముద్రంలో తేలియాడుతున్న వారిని గుర్తించి రక్షించాం. అనంతరం వారు ఇరాన్ నౌకకు చెందిన సిబ్బందేనని నిర్ధారించాం” అని చెప్పారు.నౌకలో సుమారు 180 మంది ఉన్నట్లు పత్రాల ద్వారా తెలిసిందని, కానీ గల్లంతైన వారి సంఖ్యపై ఇంకా ఖచ్చిత సమాచారం లేదని తెలిపారు.రక్షణ చర్యలు ప్రారంభించిన సమయంలో నౌక కనిపించలేదని, సముద్రంపై చమురు మరకలు, లైఫ్ రాఫ్ట్లు మాత్రమే దర్శనమిచ్చాయని వివరించారు.జలాంతర్గామి దాడి జరిగిందని ఇప్పుడే చెప్పలేమని, దర్యాప్తు అనంతరం మాత్రమే అసలు కారణం తెలుస్తుందని చెప్పారు.ఇక శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి అరుణ జయశేఖర కూడా నౌక ప్రమాదానికి గల అసలు కారణం ఇంకా తెలియలేదని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో భాగంగా ఈ నౌకపై దాడి జరిగిందా అని ప్రతిపక్ష ఎంపీ ప్రశ్నించగా, అధికారిక సమాధానం వెలువడలేదు.కొనసాగుతున్న ఇరాన్ ఉద్రిక్తతలు .రెండు బాలిస్టిక్ క్షిపణులతో తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఖతార్ రక్షణ శాఖ ప్రకటించింది. అందులో ఒక క్షిపణిని వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసిందని, మరొకటి Al Udeid Air Base వద్ద ఉన్న అమెరికా వైమానిక దళ స్థావరాన్ని తాకిందని తెలిపింది.ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని ఖతార్ స్పష్టం చేసింది. ఇదే సమయంలో, Israel Defense Forces అరబిక్ ప్రతినిధి Avichay Adraee తెహ్రాన్లోని పలు సైనిక కేంద్రాలపై దాడులు చేసినట్టు వెల్లడించారు.ఈ దాడులు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్కు అనుబంధంగా ఉన్న బసీజ్ ప్రధాన కార్యాలయంతో పాటు క్షిపణి లాంచ్ ప్యాడ్లు, రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపారు.ఇరాన్ ప్రభుత్వానికి సంబంధించిన మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.మార్చి 3 సాయంత్రం డ్రోన్ దాడి అనంతరం United States Consulate General Dubai భవనంలో మంటలు చెలరేగిన దృశ్యాలను బీబీసీ ధ్రువీకరించింది.భవనం సమీపంలోని జంక్షన్ నుంచి చిత్రీకరించిన వీడియోలో డ్రోన్ భవనాన్ని ఢీకొట్టినట్లు కనిపిస్తోంది.అమెరికా విదేశాంగ కార్యదర్శి Marco Rubio మాట్లాడుతూ, కాన్సులేట్ సమీపంలోని పార్కింగ్ ప్రదేశంలో ఒక డ్రోన్ ల్యాండ్ అయిందని ధృవీకరించారు.“మా రాయబార కార్యాలయాలు, దౌత్య కేంద్రాలు ప్రత్యక్ష దాడులకు గురవుతున్నాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa