కమెడియన్ పృథ్వి ఇప్పుడు సినిమా లతో పాటు రాజకీయాల గురించి తెగ మాట్లాడేస్తున్నాడు. అయితే ఏమాత్రం మొహమాటం లేకుండా టీడీపీ.. జనసేన పార్టీలపై విరుచుకుపడే పృథ్వి వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గారి మీద తన అభిమానం చాటుకోవడం లో ఏమాత్రం సందేహించడు. ఈమధ్య ఒక వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చాలా విషయాలపై సూటిగా.. ఘాటైన పదాలతోనే మాట్లాడాడు.
టీడీపీ నాయకుల విమర్శలపై మాట్లాడుతూ "ఒకావిడ వచ్చి మల్లెపూలు అని మాట్లాడుతుంది.. సాదిక యామిని అంట.. మల్లెపూలు. తెలుగు భాషకు.. తెలుగు పంచెకట్టుకు.. తెలుగు నుడికారానికి పెట్టింది పేరిన పార్టీ నుండి ఒక మహిళ వచ్చి పవన్ కళ్యాణ్ మల్లె పూలు నలుపుతాడు అని మాట్లాడుతుంది. పావలా పవన్ కళ్యాణ్ అనటానికి ఈవిడకేం అర్హత ఉంది... ఈవిడ రేటెంత..?"వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి రావడం లేదని అందరూ విమర్శిస్తున్నారుకదా అంటే " పార్టీ ఫిరాయించినవారిపై అనర్హత వేటు ఎందుకు వేయలేదు? ఎందుకంటే వారికి భయం.
మరి అసెంబ్లీలో జరుగున్న ఈ అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించరెందుకు" అన్నాడు.జనసేన రాబోయే రోజుల్లో వైసీపీ ఓటు బ్యాంకును చీల్చబోతోంది కదా అంటే "ఎవరు ఎంతమంది వచ్చినా సింహం సింగిల్ గా వెళ్తుందని నేను రెండు నెలల క్రితమే చెప్పా. జనసేన వారు పార్టీ పెట్టిన మొదట్లో మాకు ఆధికారం అక్కరలేదు.. ప్రశ్నిస్తాం అన్నారు. ఇప్పుడు వాళ్ళెందుకు వచ్చారు పోటీలోకి? ఇవన్నీ టంగ్ స్లిప్ మాటలు."వైసీపీ.. జనసేన కనుక కలిసి పోటీ చేస్తే ఏపీ లో క్లీన్ స్వీప్ అవుతుంది అని అంటున్నారు.. నిజంగా అలా జరుగుతుందా.. మీరేమంటారు? దీనికి సమాధానమిస్తూ " అలా కాని జరిగితే తెలుగుదేశం ఉండదిక. మూట ముల్లె సర్దుకోవడమే. అలాంటిది జరిగితే 175 సీట్లు వాళ్ళకే..! ఇలా ఉందండీ మన 30 ఇయర్స్ పృథ్వి వరస..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa