అఖిల్ అక్కినేని హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ‘ఏమైనదో… ఏమైనదో… పలుకు మరచినట్టు పెదవికేమైనదో..’ పాటకు చాలా మంచి స్పందన వస్తోంది. కాగా బుధవారం సాయంత్రం 6 గంటలకు నూతన సంవత్సరం కానుకగా ఈ చిత్రం టీజర్ను విడుదల చేయనున్నారు. అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతంః తమన్, పాటలుః శ్రీమణి, సినిమాటోగ్రఫీః జార్జ్ సి.విలియమ్స్, ఎడిటింగ్ః నవీన్ నూలి, ఆర్ట్ః అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీః శేఖర్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa