ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ వైసీపీలో చేరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. జనవరి 9న జగన్ పాదయాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న భారీ సభలో అలీ వైసీపీలో చేరుతారు.
డిసెంబర్ 28న శంషాబాద్ ఎయిర్ పోర్టులో జగన్ ను అలీ కలిశారు. ఈ సందర్భంగా వైసీపీలో చేరాలనే ఆకాంక్షను జగన్ వద్ద వ్యక్తపరిచారు. అలీ రాజమండ్రికి చెందిన వ్యక్తి కావడంతో... ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. అలీ సినీ గ్లామర్ పార్టీకి ప్లస్ అవుతుందని అంటున్నారు. మరోవైపు, పార్టీ ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అలీ సిద్ధమవుతున్నట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa