మగిజ్ తిరుమేని దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి తాత్కాలికంగా 'AK 62' అని పేరు పెట్టారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఇటీవలి తెలుగు చిత్రం గాడ్ ఫాదర్ కి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా ఈ హై బడ్జెట్ చిత్రంలో జాయిన్ అయ్యినట్లు సమాచారం. అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ స్టార్ నటుడితో నీరవ్ షాకి ఇది నాల్గవ చిత్రం.
బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఈ సినిమాలో అజిత్ కి జోడిగా కనిపించనున్నట్లు సమాచారం. స్టైలిష్ యాక్టర్ అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో భాగమవుతారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున ఈ సినిమాని నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa