విన్ను మద్దిపాటి, స్మ్రిత రాణి బోరా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "గ్రంథాలయం". సాయి శివన్ జంపాన దర్శకత్వంలో ఇంటెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను వైష్ణవి శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై వైష్ణవి శ్రీ S నిర్మిస్తున్నారు. వర్ధన్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా గ్రంథాలయం ట్రైలర్ విడుదలయ్యింది. ఒక గ్రంథాలయంలోని ప్రాచీన గ్రంథాన్ని చదివిన వాళ్ళందరూ చనిపోతూ ఉండడంతో హీరో ఈ మిస్టరీని ఎలా చేధించాడు అనే నేపథ్యంలో విడుదలైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. పోతే, వచ్చే నెల 3న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.