తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు. వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకు వెళ్లే తత్వం. గమ్యం నుంచి కథానాయకుడు వరకూ 11 ఏళ్ల ప్రస్థానంలో ఆణిముత్యాల్లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. హిట్లు, ప్లాప్లకు అతీతంగా క్రిష్ను ప్రేక్షకులు అభిమానించటం ఆయన ప్రత్యేకత. అటువంటి దర్శకుడు వివాదాలకు కేరాఫ్ గా మారాడు. కంగనా ప్రధానపాత్రగా రూపొందించిన మణికర్ణిక దర్శకత్వం తానే చేశానంటూ కామెంట్ చేశాడు. కంగనా కావాలనే తన పేరు వేయకుండా ఉందంటూ చెప్పారు. కానీ.. కంగనా వైపు నుంచి క్రిష్ను దోషిగా నిలిపే ప్రయత్నం జరిగింది. కేవలం 30శాతం మాత్రమే దర్శకత్వం వహించిన ఆయన అంతా తానేనంటూ చెప్పుకోవటాన్ని కంగనా అండ్ కో విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా.. ఆమె సోదరి రంగోలి కూడా. క్రిష్ చేసిన 30శాతాన్ని 70శాతంగా చూపటంపై స్పందించారు. ఓకే.. ఆయనే అంతా చేసినట్టయితే మేం అంగీకరిస్తున్నాం.
తెరవెనుక ఆయనే ఉన్నా.. తెరపై మాత్రం కంగనా దుమ్ము రేకెత్తిస్తోందని.. తమ సీట్లో కూర్చుని సినిమా ఎంజాయ్ చేయమంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ఆయన వ్యక్తిగత జీవతం కూడా సాఫీగా సాగటలేదు. భార్యతో తలెత్తిన విబేదాలతో విడాకులకు దరఖాస్తు చేశారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్ను నెత్తికి ఎత్తుకుని తీర్చిదిద్దినా. బాక్సాఫీసు వద్ద అంచనాలు అందుకోలేక పోయింది. పైగా.. బాలయ్య చెప్పినట్టుగానే క్రిష్ నడుచుకోవాల్సి వచ్చింది. దీనివల్ల ఆయన తన ఐడెంటీనీ మిస్సయ్యారంటూ చిత్రపురిలో మరో పుకార్లు మొదలయ్యాయి. ఫిబ్రవరిలో మహానాయకుడు సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. మొదటి భాగంపై పెదవి విరిచిన ప్రేక్షకులు.. రెండోభాగాన్ని ఎలా ఆదరిస్తారనే అనుమానాలు కూడా చిత్ర యూనిట్లో మొదలయ్యాయి. ఇన్ని ఇబ్బందుల మధ్య క్రిష్ పడుతున్న ఇబ్బందులు విధి రాసినవా.. తనకు తాను సృష్టించుకున్నవా! అనేది మాత్రం క్రిష్ కే తెలియాల్సిన విషయాలు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa