నందమూరి బాలకృష్ణ హీరోగా, రాజకీయ నాయకుడిగా, హోస్టుగా చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త పాత్రలో నటించబోతున్నాడు. తాజాగా ఐపీఎల్ 2023లో బాలయ్య కామెంటేటర్గా వ్యవహరించబోతున్నారు.ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ తొలిరోజు వినోదం మరో స్థాయిలో ఉండబోతోంది.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తనకు నచ్చిన గేమ్లో వ్యాఖ్యాతగా నిలవడం ఆనందంగా ఉందని, గేమ్ ఆడినంత సంతృప్తిని ఇస్తుందని అన్నారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.