అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమా సెప్టెంబర్ 9, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యి సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. తాజాగా ఇప్పుడు, థియేట్రికల్ విడుదలైన ఆరు నెలల తర్వాత ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ఏప్రిల్ 14, 2023న సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్గా ప్రదర్శించబడుతుందని సమాచారం.
ఈ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ అలియా భట్ జంటగా నటించారు. ఈ మాగ్నమ్ ఓపస్ బ్రహ్మాస్త్రలో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, అండ్ నాగార్జున అక్కినేని కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్లైట్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.