బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, రాజ్కుమార్ హిరానీతో 'డుంకి' అనే సినిమాని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం, ప్రస్తుతం నిర్మాణ దశలో ఈ చిత్రం OTT భాగస్వామిని లాక్ చేసింది. గత రాత్రి జరిగిన స్టార్-స్టడెడ్ ఈవెంట్లో జియో స్టూడియోస్ ప్లాట్ఫారమ్ లో విడుదల కానున్న భారీ చలనచిత్రాలు మరియు స్ట్రీమింగ్ షోలను ఆవిష్కరించింది. రానున్న రోజులలో ఈ ప్లాట్ఫారమ్పై ప్రసారం చేయబోయే సినిమాల్లో డుంకీ ఒకటి.
ఈ సినిమాలో బాలీవుడ్ కింగ్ ఖాన్ సరసన గ్లామర్ బ్యూటీ తాప్సీ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాని డిసెంబర్ 22, 2023న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్కుమార్ హిరానీ ఫిల్మ్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ మరియు జియో స్టూడియోస్పై రాజ్కుమార్ హిరానీ మరియు గౌరీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.