ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో జరుగుతున్న 44వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.దీంతో చెన్నై సూపర్ కింగ్స్కు విజయానికి 160 పరుగుల లక్ష్యం నిర్దేశించబడింది.
*ముంబై బ్యాటింగ్ హైలైట్స్ : ముంబై ఇన్నింగ్స్ ఆరంభంలోనే విల్ జాక్స్ (1) త్వరగా అవుట్ కావడంతో జట్టు ఒత్తిడిలో పడింది. అయినప్పటికీ నమన్ ధీర్ అద్భుతంగా రాణించి అర్ధ సెంచరీతో ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. అతను 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు.ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ 24 బంతుల్లో 37 పరుగులు చేసి ఆకట్టుకోగా, అందులో 5 సిక్సర్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ 21 పరుగులు చేయగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 18 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. చివర్లో ట్రెంట్ బౌల్ట్ ఒక సిక్సర్తో 7 పరుగులు జోడించి స్కోరును 159 వరకు తీసుకెళ్లాడు.
*చెన్నై బౌలింగ్ ప్రదర్శన :చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 కీలక వికెట్లు తీసి ముంబైకి దెబ్బకొట్టాడు. నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా, జామీ ఓవర్టన్ మరియు రామకృష్ణ ఘోష్ తలో వికెట్ సాధించారు.చెపాక్ పిచ్పై 160 లక్ష్యం పెద్దదిగా కనిపించకపోయినా, ముంబై బౌలర్లు ఈ స్కోరును ఎలా కాపాడతారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa