టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకతంలో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'OG' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ పెట్టారు. తాజాగా ఈరోజు ముంబైలో జరుగుతున్న ఈ సినిమా సెట్స్లో పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యారని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆయనతో పాటు మరికొందరికి సంబంధించిన కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్లో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ బిగ్గీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa