ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత సర్జికల్ స్ట్రయిక్స్ పై ఎన్టీఆర్,మహేష్ బాబు,చరణ్,రాజమౌళి ....

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 26, 2019, 12:26 PM

భారత సర్జికల్ స్ట్రయిక్స్ పై టాలీవుడ్ ప్రముఖులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక దిగ్గజం రాజమౌళి తదితరులు తమతమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పాక్ లోకి దూసుకెళ్లి దాడులు చేసి పెద్దఎత్తున ఉగ్రవాదులను హతమార్చి వచ్చిన వాయుసేన దళాలపై ప్రశంసలు కురిపించారు. మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, "ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను చూసి గర్విస్తున్నాను. ధైర్యవంతులైన ఐఏఎఫ్ పైలట్లకు నా సెల్యూట్" అన్నారు. ఇదే దాడులపై స్పందించిన ఎన్టీఆర్ "మన దేశం గట్టి జవాబు ఇచ్చింది. భారత వాయుసేనకు సెల్యూట్ చేస్తున్నా" అనగా, "సెల్యూట్ టూ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్... జై హింద్" అని రాజమౌళి, "భారత వాయుసేనను చూసి గర్విస్తున్నా... జై హింద్" అని రామ్ చరణ్ ట్వీట్లు పెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa