పుల్వామా ఘటనకు భారత్ తిరుగులేని ప్రతీకారం తీర్చుకుంది. నేరుగా పాక్ భూభాగంలోకి ప్రవేశించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిరాజ్ యుద్ధ విమానాలు జైషే మహమ్మద్ టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్ ని నిలబెట్టాం చేసి వచ్చాయి. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. బాలాకోట్ పై బాంబుల వర్షం కురిపించిన ఇండియా జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలని, 300 మంది ఉగ్రవాదులని మట్టికరిపించింది.
ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ వైమానిక దళాలు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. వాటిని తిప్పికొట్టే ప్రయత్నంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ అభినందన పాక్ ఆర్మీకి చిక్కారు. అభినందన్ గాయాలతో కనిపిస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్ అదుపులో ఉన్నప్పటికీ అభినందన్ చెక్కుచెదరని ధైర్యంతో కనిపిస్తున్నదని దేశం ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటె ఈ ఘటనపై హీరో రామ్ స్పందిస్తూ...శాంతిని కోరుకుంటూ అద్భుతమైన ప్రసంగం చేశారు ఇమ్రాన్ ఖాన్ సర్. శాంతి మంత్రం జపించే మీ చేతుల్లో మా హీరో ఉన్నారు. ఆయన పట్ల మీరెలా వ్యవహరిస్తారో ఇండియా మొత్తం చూస్తుంది. మా హీరోని వదిలిపెట్టాలి అని రామ్ కోరాడు.
అలాగే సిద్దార్థ్ స్పందిస్తూ.... మా సైనికుల్ని టెర్రరిస్టులు చంపేశారు. వారి స్థావరాలని మేము నాశనం చేశాం. మా మనుషులు ఎవరూ చనిపోలేదని పాక్ అంటోంది. కానీ ఉగ్ర స్థావరాలు మా దేశంలో లేవు అని మాత్రం చెప్పడం లేదు. ఇప్పుడు మా పైలెట్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడే మీ బుద్ది బయటపడుతోంది. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దత్తు తెలుపుతోంది. కానీ ఇండియా అలా కాదు. ఈ నిజాన్ని ఎవరూ కాదనలేరు అని సిద్దార్థ్ ట్విట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa