విజయ్ బిన్ని దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'నా సామి రంగా' అనే టైటిల్ ని లాక్ చేసారు. నా సామి రంగ చిత్రంలో ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఇప్పుడు యువ దర్శకుడు ఆషిక గురించి మాట్లాడుతూ ఈ చిత్రంలో ఆమె అద్భుతంగా నటించారు మరియు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా విడుదల తర్వాత తెలుగు చిత్రసీమలో ఆషిక పెద్ద పేరు తెచ్చుకుంటుందనీ రానున్న రోజుల్లో మరింత బిజీ అవుతుందని విజయ్ చెబుతున్నాడు.
ఈ గ్రామీణ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా జనవరి 14,2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అకాడమీ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |