ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ చరణ్‌కి వీరాభిమానిగా మార్చిన విషయాన్ని వెల్లడించిన కృతి శెట్టి

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2024, 02:35 PM

బ్లాక్ బస్టర్ ఉప్పెన తర్వాత కృతి శెట్టి ఓవర్ నైట్ సెన్సేషన్ అయింది. బేబమ్మగా ఆమె నటన యువతను పిచ్చెక్కించింది. కానీ ఈ రొమాంటిక్ డ్రామా తర్వాత యువ నటి అనేక ఫ్లోప్స్ ని ఎదుర్కొంది. తాజాగా ఇప్పుడు శర్వానంద్ కథానాయకుడిగా నటించిన మనమే అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆమె మల్లి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. గతంలో చాలా సార్లు కృతి శెట్టి తాను రామ్ చరణ్‌కి వీరాభిమానిని అని చెప్పింది. మనమేని ప్రమోట్ చేస్తున్నప్పుడు, ఆమె RRR స్టార్‌ని మెచ్చుకోవడానికి కారణమేమిటని అడిగారు. కృతి శెట్టి మాట్లాడుతూ... అతను చాలా మంచి పెర్ఫార్మర్. నేను ఉప్పెన కోసం పనిచేయడం ప్రారంభించిన తర్వాత నేను రంగస్థలం చూసాను మరియు రామ్ చరణ్ గారి నటన నా మనసును కదిలించింది. ఆయన డెడికేషన్ గురించి చాలా విన్నాను. నిజ జీవితంలో కూడా ఆయన గొప్ప వ్యక్తి ఈ విషయాలు నేను అతనిని మెచ్చుకునేలా చేశాయి అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa