వరుస సినిమాల తో బిజీ గా ఉన్న అనసూయ .బుల్లితెరపై హాట్ నెస్ ను పంచి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అనసూయకు.. మొదట్లో అవకాశాలు చకచకానే వచ్చాయి. సోగ్గాడే చిన్ని నాయనతో ఎంట్రీ.. ఆ వెంటనే క్షణంలో ప్రధాన పాత్రలో మెరుపులతో డిమాండ్ కూడా పెరిగింది. అయితే.. రోల్స్ విషయంలో తను సంతృప్తి చెందాలని కండిషన్స్ పెట్టి.. వరుసగా సినిమాలు తిరగ్గొట్టేసింది అనసూయా భరద్వాజ్.
ఇప్పుడు మాత్రం రూట్ మార్చినట్లుగా కనిపిస్తోంది అనసూయ. విన్నర్ మూవీలో సాయిధరం తేజ్ తో కలిసి ఐటెం సాంగ్ లో మెరిసిన తర్వాత.. ఈ భామ నిర్ణయాల్లో మార్పులు బాగానే కనిపిస్తున్నాయి. రంగస్థలం 1985 అంటూ రామ్ చరణ్ తో సుకుమార్ తెరకెక్కిస్తున్న మూవీలోకి అనసూయ ఎంట్రీ షాకింగ్ అనాల్సిందే. ఇప్పుడు గాయత్రి అంటూ మోహన్ బాబు మూవీలో జర్నలిస్ట్ పాత్ర పోషించనుందని అంటున్నారు. రజినీకాంత్ కాలాలో కూడా ఓ కీలక పాత్ర చేస్తోందట.
ఇవి కాకుండా కన్నడలో మిలనా అనే మూవీలో స్పెషల్ రోల్ చేయనుంది. శాండల్ వుడ్ లోనే మునిరత్న కురుక్షేత్రలో కూడా ఈ భామ నటించేస్తోంది. ఇవి కాకుండా తెలుగులో మరో రెండు సినిమాలను ఒప్పేసుకుంది. అంటే అమ్మడి చేతిలో అరడజన్ కు పైగా ప్రాజెక్టులు ఉన్నాయన్న మాట. ఒకేసారి ఇన్ని సినిమాలు అంటే.. అనసూయ గాలి ఫిలిం నగర్లో ఏ రేంజులో వీస్తోందో అర్ధం చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa