ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మరోసారి నోరుపారేసుకున్నారు. ఇప్పటికే తన అనుమతి లేకుండా పాటలు వాడుకుంటున్నారంటూ యువ సంగీత దర్శకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. జూన్ 2న ఇళయరాజా 76వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకiన్నారు. ఈ సందర్భంగా చెన్నైలో ఆయన ఓ కచేరీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జేసుదాస్ పాల్గొన్నారు. కార్యక్రమం మధ్యలో ఓ సెక్యూరిటీ గార్డు వాటర్ బాటిల్ ఇచ్చేందుకు స్టేజ్ మీదకు వచ్చాడు. దీంతో ఇళయరాజా అతనిపై మండిపడ్డారు. ‘అనుమతి లేకుండా స్టేజ్పైకి వచ్చి కార్యక్రమాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావ్?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సెక్యూరిటీ గార్డు ఇళయరాజాకు క్షమాపణలు చెబుతూ కాళ్లు పట్టుకున్నారు. అయినా.. శాంతించని ఇళయరాజా అతనిపై తిట్ల పురాణం ఆపలేదు. తర్వాత కూడా దూషణ పర్వం మొదలు పెట్టారు. రూ.500, రూ.1000 ఇచ్చి సీట్లు కొనుకున్న వారంతా.. రూ.10 వేలు ఇచ్చి సీట్లు బుక్ చేసుకున్న వారి స్థానాల్లో కూర్చున్నారంటూ దురుసుగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa