రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' మూవీ రూపొందుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగు దశలో వుంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశం ఒక రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇది ఒక భారీ పోరాట సన్నివేశామని తెలుస్తోంది.
ఎన్టీఆర్ .. చరణ్ తో పాటు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ పోరాట సన్నివేశంలో పాల్గొననున్నట్టు సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం 45 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారట. విజువల్ వండర్ గా అనిపించే ఈ సన్నివేశం ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. తెలుగు .. తమిళ .. హిందీ ఆర్టిస్టులు ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను 350 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. జూలై 30 2020లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa