సినీప్రేమికుల ఎన్నో ఏళ్ల కలను, భారతీయ సినిమాను ఆస్కార్ వేదికపై సగర్వంగా నిలబెట్టింది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం. ఇప్పుడా దిశగానే తొలి అడుగు వేసింది హిందీ సినిమా ‘లాపతా లేడీస్’. ఈ చిత్రం 2025 ఆస్కార్ పురస్కారాలకు మనదేశం నుంచి అధికారికంగా ఎంపికైంది.వరల్డ్ ఉత్యుత్తమ సినీ అవార్డ్స్గా ఆస్కార్కి గుర్తింపు ఉంది. ఈసారి కూడా 29 సినిమాలు ఆస్కార్ రేసులో నిలిచాయి. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వీటి నుంచి ‘లాపతా లేడీస్’ చిత్రాన్ని ఆస్కార్కు పంపేందుకు నిర్ణయించింది. తెలుగు నుంచి హనుమాన్, కల్కి 2898AD, మంగళవారం.. హిందీ నుంచి యానిమల్, శ్రీకాంత్, మైదాన్, ఆర్టికల్ 370 తదితర సినిమాలు ఆస్కార్ రేసులో నిలిచాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa