తమిళ మూవీ బ్రదర్ హీరో జయం రవికి అచ్చిరాలేదు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ డిజాస్టర్గా నిలిచి జయం రవికి పెద్ద షాకిచ్చింది. బ్రదర్ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించగా...సీనియర్ కథానాయిక భూమిక ఓ కీలక పాత్ర పోషించింది. అమరన్కు పోటీగా అక్టోబర్ 31న కోలీవుడ్ బాక్సాఫీస్ బరిలో నిలిచిన ఈ సినిమాకు ఎమ్ రాజేష్ దర్శకత్వం వహించాడు.బ్రదర్ మూవీ థియేటర్లలో రిలీజైన నెలలోపే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకున్నది. నవంబర్ 29న జయం రవి మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెబుతోన్నారు.థియేటర్లలో కేవలం తమిళంలోనే రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం ఐదు భాషల్లో విడుదలకానున్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. కాగా బ్రదర్ మూవీ ఓవర్సీస్ ఓటీటీ ఐంథుసన్లో శనివారం రిలీజైంది.బ్రదర్ మూవీలో నటరాజ సుబ్రమణియమ్, రావురమేష్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. హరీస్ జయరాజ్ మ్యూజిక్ అందించాడు. జయం రవి హీరోగా నటించిన 30వ సినిమా ఇది.జీ5 ఓటీటీలో ఈ నెలాఖరు నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa