నాని హీరోగా నటించిన ‘దసరా’ చిత్రంలో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితోనే ‘ద ప్యారడైజ్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన మూడవ చిత్రం ఉంటుంది. ఇప్పుడు నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నారు శ్రీకాంత్. అనురాగ్ రెడ్డి, శరత్చంద్రలతో కలసి ‘ఏఐ అమీనా జరీనా రుక్సానా.. గులాబీ’. చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల కథను సమకూర్చిన ఈ చిత్రంతో చేతన్ బండి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘2009 లో గోదావరిఖని పట్టణంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకొనే ప్రేమకథ ఇది. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’ అని శ్రీకాంత్ ఓదెల చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa