బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎమేమి చేస్తున్నారో చూసి వాళ్లకు రెడ్, గ్రీన్ మార్కులు ఇవ్వమని చెప్పారని నటి హేమ తెలిపారు. ఆమె బిగ్ బాస్ హౌస్లో తాను ఉన్నన్ని రోజులు ఏం జరిగింది మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. హౌస్లో తనకు తెలిసింది, తాను అనుకున్నదాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అయితే అందులో ఏది తప్పు, ఏది ఒప్పు అనేది అక్కడున్న పరిస్థితిని బట్టి తాను నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు. అయితే హౌస్లో తాను బాగా చేశానని మీడియా, పేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో చాలామంది తనకు మద్దతుగా రాశారని అన్నారు. తాను ఎక్కడా తప్పు చేయలేదని హేమ స్పష్టం చేశారు. అయితే తాను గేమ్లోకి వెళ్లకుండానే బయటకు వచ్చేశానని హేమ చెప్పారు.
యాంకర్ శ్రీముఖి తన వద్దకు వచ్చి అక్కా టీ పెట్టడానికి పాలు లేవని వాళ్లు రెండు, మూడుసార్లు టీ అడుగుతున్నారని ఆమె చెప్పిందని హేమ తెలిపారు. అది బిగ్ బాస్ హౌస్లో చూపించలేదని ఆమె అన్నారు. మళ్లీ శ్రీముఖే బయటకు వెళ్లి హేమక్క టీకి పాలు లేవందని, నీళ్లు పోసేసిందని చెప్పిందని, ఇవన్నీ తాను బయటకు వచ్చాక తెలిసిందని హేమ తెలిపారు. తనపై ఆమె ఎందుకు అలా చెప్పిందా? అని ఆశ్చర్యపోయానని అన్నారు. ఇక పిల్లల విషయంలోకి వస్తే వంట దగ్గర తానేదే కామాండింగ్గా ఉన్నానని అన్నారని, అయితే ఫ్రైడ్ రైస్ చేస్తామంటే చేయమన్నానని, అయితే వారం రోజులు వండాలంటే ఎంత రేషన్ కావాలనేది తనకు తెలుసునని, సలహాలు ఇవ్వద్దని చెప్పానని అన్నారు. అంతే తప్పవాళ్లు కూడా పలానా వండి పెట్టమని తనను అడగలేదని హెమ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa