ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భైరవం' Q అండ్ A సెషన్ కి వెన్యూ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Sat, May 31, 2025, 03:27 PM

విజయ్ కనకమేడల దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన 'భైరవం' సినిమా మే 30న విడుదల అయ్యింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు మంచు మనోజ్ మరియు నారా రోహిత్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాలో అతిధి శంకర్మ హిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క Q అండ్ A సెషన్ ని ఈరోజు సాయంత్రం 4 గంటలకి హైదరాబాద్ అవస హోటల్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో దివ్య పిళై, ఆనంది, ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్, అజయ్, శరత్, జయసుధ, సంపత్ రాజ్, గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంభాషణలు సత్యర్షి మరియు తూమ్ వెంకట్ అందించగా, భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ మరియు తిరుపతి సాహిత్యం అందించారు. ఈ చిత్రం తమిళ బ్లాక్‌బస్టర్ గరుడన్ యొక్క అధికారిక తెలుగు రీమేక్‌. పెన్ స్టూడియోస్‌కు చెందిన డాక్టర్ జయంతిలాల్ గదా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ హరి కె వేదాంతం, మ్యూజిక్ కంపోజర్ శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa