ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బోర్డర్ 2' షూటింగ్ లో జాయిన్ అయ్యిన ఆహాన్ శెట్టి

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 03:46 PM

అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న 1997 ఎపిక్ వార్ ఫిలిం "బోర్డర్"కి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ "బోర్డర్ 2" చిత్రీకరణ ప్రారంభమైంది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ మరియు అహన్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు  ప్రముఖ నటుడు సునీల్ శెట్టి కుమారుడు ఆహాన్ శెట్టి ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యినట్లు సమాచారం. పూణే లో ఈ సినీమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినీమాలో సోనమ్ బజ్వా మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. JP దత్తా దర్శకత్వం వహించిన అసలైన "బోర్డర్" చిత్రం, 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో జరిగిన లోంగేవాలా యుద్ధం ఆధారంగా రూపొందించబడింది. గుల్షన్ కుమార్ మరియు టి-సిరీస్‌తో సహా పవర్‌హౌస్ నిర్మాణ బృందంతో "బోర్డర్ 2" బ్లాక్‌బస్టర్ అవుతుందని భావిస్తున్నారు.  ఈ చిత్రం జనవరి 23, 2026న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, JP దత్తా మరియు నిధి దత్తా నిర్మించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa