టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ 20వ చిత్రం "సుందరకాండ" ఆగష్టు 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రోహిత్ సరసన వృతి వాఘని కథానాయికగా నటిస్తుండగా, శ్రీ దేవి విజయ్ కుమార్ ఆమె తల్లిగా నటించారు. ఈ చిత్రంలో నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాని మేకర్స్ భారీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క నైజాం థియేటర్ రైట్స్ ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP బ్యానర్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి మరియు రాకేష్ మహంకాళ్ళ త్రయం నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa