by Suryaa Desk | Fri, Oct 25, 2024, 03:37 PM
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిర్మాత నాగవంశీ తాజాగా దీనిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. పుష్ప 2 సినిమా అయ్యాక అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు అని నిర్మాత నాగవంశీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఆయన నిర్మాణంలోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవల పలుమార్లు నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని, భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా అని అంచనాలు పెంచారు.తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. అల్లుఅర్జున్ – త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయి. జనవరిలో ఓ స్పెషల్ గ్లింప్స్ తో సినిమాని ప్రకటిస్తాము. మార్చ్ నుంచి మూవీ షూటింగ్ మొదలుకానుంది. అల్లు అర్జున్ కూడా మార్చ్ లోనే ఆ సినిమా షూట్ లో పాల్గొంటారు. ఇప్పటివరకు రాజమౌళి రకరకాల జానర్ లో సినిమాలు చేసారు. రాజమౌళి కూడా టచ్ చేయని జానర్ లో ఈ సినిమా ఉండబోతుంది. దేశంలో ఎవ్వరూ చూడని ఓ ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా సినిమాని తెరకెక్కించబోతున్నాం అని తెలిపారు.
Latest News