ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో భానుడి భగభగలు.. తీవ్ర వడగాలులు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 02, 2024, 08:11 PM

తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోత, వడగాలులతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ఉదయం 10 తర్వాత హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాలోని ప్రధాన రహదారులపై రద్దీ తగ్గుతోంది. ఇక మిట్ట మధ్యాహ్నం అయితే.. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఫ్యాన్లు, కూలర్లు వేసుకున్నా.. ఎండ తీవ్రత మాత్రం తగ్గటం లేదు.


కాగా.. వచ్చే నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా.. ఒకటి రెండు డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. రెండు రోజుల పాటు తీవ్ర వడగాల్పుల ప్రభావం కూడా ఉంటుదని చెప్పారు. ఈ మేరకు 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, కుమ్రంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈ వడగాల్పుల ప్రభావం ఉంటుందని అన్నారు.


తెలంగాణలో ఎండలు, వేడి గాలులు.. ప్రజలకు బిగ్ అలర్ట్


వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళ ఎక్కువగా ప్రయాణాలు పెట్టుకోవద్దని చెప్పారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవటమే ఉత్తమమని అంటున్నారు. తప్పనిసరి బయటకు వెళ్తే టోపీ, జేబు రుమాలు, గొడుగు వంటి ధరించాలని చెబుతున్నారు. తేలిక పాటి ద్రవపదార్థాలు ఆహారంగా తీసుకోవాలని.. నీరు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు. వడదెబ్బకు గురైతే వెంటనే స్థానిక డాక్టర్‌ను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa