బీజేపీ నేత, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపై కేసు నమోదైంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ రఘునందన్ రావుపై సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన సహా అనుచిత వ్యాఖ్యలు చేశారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. రఘునందన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో రఘునందన్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి పేర్కొన్నారు.
ఓ మీటింగ్లో రఘునందన్ రావు మాట్లాడుతూ.. హరీశ్ రావు, వెంకటరామి రెడ్డి ఉద్దేశించి.. "ఇంటికొచ్చి కొడతా దొంగ నా కొ**ల్లారా", "పెయ్యి మీద బట్టలిప్పి కొడతా దొంగ నా కొ**ల్లారా.." అంటూ వ్యాఖ్యానించినట్టుగా చింతా ప్రభాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మాటలు సమాజంలో హింసను రేకెత్తించేలా ఉన్నాయని.. దీనివల్ల కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఘర్షణలకు దిగే అవకాశం ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం.. ఎన్నికల నిబంధనలకు కూడా విరుద్దమని గుర్తు చేశారు. ఈ మేరకు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరగా.. పోలీలులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మరోవైపు.. ఫోన్ ట్యాపింక్ వ్యవహారంపై రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలప్పుడే తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పినట్టుగా గుర్తు చేశారు. ఆ విషయం మాట్లాడితే.. తమ మీదే కేసు పెట్టారని రఘునందన్ రావు తెలిపారు. వివేక్ వెంకట స్వామి, కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారని, మీరు శిక్షించే స్థానంలో ఉన్నారని చెప్పుకొచ్చారు. 2015లో రేవంత్ రెడ్డి పోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పక్కన పెట్టి ఆ తర్వాత జరిగిన పోన్ ట్యాపింగ్లపై విచారణ అంటున్నారంటూ చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు ఇంటిలిజెన్స్ చీఫ్ ప్రస్తుత ఇంటిలిజెన్స్ చీఫ్ శివదర్ రెడ్డి కాదా.. అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa