ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శేరిలింగంపల్లి కాంగ్రెస్ లో భారీగా చేరికలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 02, 2024, 08:19 PM

శేరిలింగంపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగాయి. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంగళవారంనాడు శేర్లింగంపల్లి నియోజకవర్గంవివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు బాషిపాక యాదగిరి ఆధ్వర్యంలో కాంగ్రేస్ పార్టీలో చేరిన సురేఖ, భాగ్యలక్ష్మి.సరస్వతి, స్వప్న.మల్లికా,శ్రీనివాస్,విజయ్ కుమార్,సంతోష్ ఇతర బిఆర్ఎస్ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున్న చేరారు. బిఆర్ఎస్ పార్టీ స్థాపించిన 2001 నాటి నుండి పార్టీ కోసం పని చేసిన తగిన గుర్తింపు లేదని,శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజ నాయకుడి వెంటా నడిచేందుకు ఈరోజు నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంటెస్టెడ్ కార్పొరేటర్ బాషిపాక నాగమణి యాదగిరి, సీనియర్ నాయకులు మూకయ్య. వెంకటస్వామి సాగర్.వెంకటేశ్ డాన్. దయాకర్ రెడ్డి.అంజలి రంగారెడ్డి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి,నియోజకవర్గ నాయకులు మన్నెపల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa