నాగార్జున సాగర్ నందికొండలోని వాటర్ ట్యాంక్లో సుమారు 30 కోతుల కళేబరాలు కనిపించటం ప్రజలను షాక్కు గురి చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై స్థానికంగా కలవరం సృష్టిస్తోంది. వాటర్ ట్యాంకులో కోతులు పడి 10 రోజులు కావొస్తుందని.. అవే నీటిని స్థానికులు తాగారంటూ వార్తలు ప్రచారమవుతుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. దీంతో.. ఈ విషయం ఇప్పుడు రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ మున్సిపల్ శాఖలో ఇంత ఘోరమైన పరిస్థితులున్నాయా.. ఇది సిగ్గుపడాల్సిన పరిస్థితి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాగునీటి ట్యాంకుల శుభ్రత నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. ప్రజల ఆరోగ్యం కంటే ఈ సర్కారుకు రాజకీయాలే ముఖ్యమంటూ నిప్పులు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
మరోవైపు.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించారు. మున్సిపాలిటీ శాఖలో నిర్లక్ష్యం అలుముకుందని.. ప్రజలకు తాగునీటిని అందించే వాటర్ ట్యాంకులను నిత్యం తనిఖీ చేసే సమయం కూడా అధికారులకు లేకుండా పోయిందంటూ మండిపడ్డారు. వాటర్ ట్యాంకులో కోతులు చనిపోయిన నీళ్లు తాగి ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే వారికి వైద్య పరీక్షలు చేయించాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇప్పటికే గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారని.. సాగునీటికి నీళ్లు అందించమంటే కూడా ప్రభుత్వానికి చేతకాలేదని జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బయటకి రాగానే ప్రాజెక్టుల నుంచి నీళ్లను వదిలారని గుర్తు చేశారు. ప్రత్యేక ప్రణాళికతో ప్రజలకు తాగు నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa