ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉప్పల్‌ స్టేడియానికి సీఎం రేవంత్ రెడ్డి.. అట్లుంటది ధోనీ క్రేజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 05, 2024, 07:54 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 17వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఢీకొననుంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో హైదరాబాద్, చెన్నై జట్ల మధ్య శుక్రవారం సాయంత్రం జరిగే ఈ మ్యాచ్‌ను చూసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. కుటుంబసమేతంగా స్టేడియానికి వెళ్లి.. ఆయన మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ముఖ్యమంత్రి కుటుంబసమేతంగా స్టేడియానికి వస్తుండటంతో భద్రతను మరింత కట్టదిట్టం చేశారు పోలీసులు.


ఇక, ఐదేళ్ల తర్వాత ధోని హైదరాబాద్‌లో ఆడుతుండటంతో ఈ మ్యాచ్‌‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. అలాగే, అంతర్జాతీయ క్రికెట్‌‌లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ధోనీకి దాదాపు ఇదే చివరి ఐపీఎల్. ఇకపై మైదానంలో మహేంద్రుడి మెరుపులు చూడలేకపోవచ్చు. అందుకే క్రికెట్ అభిమానులు ఆయన కోసం ప్రత్యేకంగా మ్యాచ్‌ను తిలకించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సామాన్యుల నుంచి వీఐపీల వరకు టికెట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా ఉన్నతాధికారులకు ఐపీఎల్‌ నిర్వాహకులు కాంప్లిమెంటరీ పాసులు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ధోని రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టిక్కెట్టకు తెగ డిమాండ్ ఏర్పడింది.


ఇటీవల వైజాగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వింటేజ్ ధోనీ బయటకు వస్తుంటే స్టేడియం దద్దరిల్లిపోయింది. ఢిల్లీ సొంత మైదానంగా ఎంచుకున్న విశాఖలోని ఏసీఏ స్టేడియం చెన్నైలోని చెపాక్‌ స్టేడియాన్ని మరిపించింది. ఆఖర్లో ధోని బాదుతుంటే చెన్నై ఓడిందా లేక ఢిల్లీ గెలిచిందా అనేది అర్థం కాలేదు. దీంతో హైదరాబాద్‌లోనూ ఆయన ఆటను చూసేందుకు అభిమానులు తహతహలాడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa