ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవన్నీ నాకు మెడల్సే, వాటి భరతం పట్టేందుకు పాదయాత్ర చేస్తా.. మాధవీలత కీలక నిర్ణయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 14, 2024, 07:39 PM

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఇప్పుడు ట్రెండింగ్‌గా మారారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం సమయంలో ఆమె చేసిన కొన్ని పనులు, ఆమె చేసిన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారిన మాధవీలత.. తాజాగా మే 13న జరిగిన పోలింగ్‌ ప్రక్రియలో ఆమె చేసిన హడావుడితో మరోసారి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ లోక్ సభ సెగ్మెంటులోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వచ్చిన ముస్లిం మహిళలను బుర్ఖాలు తీయాలని, ఆధార్ కార్డులు చూపించాలంటూ హడావుడి చేయటం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల అధికారి ఆదేశాలతో ఆమెపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. దీంతో.. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి పోలింగ్ పూర్తయ్యేవరకు మాధవీలతపై పలు కేసులు నమోదయ్యాయి.


అయితే.. ఈ వివాదంపై స్పందించిన మాధవీలత.. నిజాలు మాట్లాడినందుకు తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను తాను మెడల్స్‌గా భావిస్తానని తెలిపారు. మైనర్‌లతో ఓటు వేయించినా కేసు నమోదు చేయని అధికారులు.. తనపై మాత్రం స్వేచ్ఛగా కేసులు పెడుతున్నారన్నారు. ఒక అభ్యర్థిగా ఓటర్లను తనిఖీ చేసే హక్కు తనకు ఉందని, మర్యాదగా ముస్లిం మహిళా ఓటర్ల బుర్ఖా తొలగించమని అడిగానని ఆమె తెలిపారు. అందులోనూ తప్పులు వెతికితే.. వారు భయపడుతున్నట్లే అన్నారు.


మరోవైపు.. 150 మంది మహిళలను మరో ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఓట్లు వేపిస్తున్నారన్న సమాచారం రావటంతో తాము ఆ పోలింగ్‌ బూత్‌కు వెళ్లామని తెలిపారు మాధవీలత. ఓటర్లను సరిపోల్చుకోవడానికి బుర్ఖాలు తొలగించాలని అటు పోలీసులు, ఇటు పోలింగ్ సిబ్బంది కోరడం లేదన్నారు. మహిళా పోలీసులు అలా చెక్‌ చేయడానికి తమకు ఎలా ఆదేశాలు లేవని తమ అధికారులు చెప్పినట్లు మాధవీలత ఆరోపించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa