తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం చూసేవారికి గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సొంత నియోజకవర్గం పాలేరులో 'ప్రజల వద్దకే మంత్రి పొంగులేటి' కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాట్లాడిన పొంగులేటి.. ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్లపై కూడా కీలక కామెంట్స్ చేశారు. నియంతృత్వ పాలన నుంచి మార్పు కావాలనే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని అన్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు త్వరలోనే అర్హులు అందరికీ కొత్త పెన్షన్లు, పెంచిన పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని భరోసా ఇస్తున్నారు. తెలంగాణ గ్రామాల్లో ఉన్న స్కూల్స్, రోడ్లు, కమ్యూనిటీ హల్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు.
పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని, పార్లమెంట్ ఎన్నికల కోడ్ అయిపోగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలు పెడాతానని అన్నారు. ప్రజలు అడిగిన సమస్యలే కాకుండా అడగని సమస్యలు కూడా పరిష్కరిస్తాని హామీ ఇచ్చారు. భవిష్యత్లో ఏ సమస్య వచ్చినా.. ఇందిరమ్మ కమిటీ ద్వారా తనకు తెలియచేయాలని పొంగులేటి ప్రజలకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa