ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాదాద్రి వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ కొత్త రూల్ తెలుసా ? లేదంటే దర్శనానికి వెళ్లనివ్వరు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 19, 2024, 03:37 PM

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రిలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి తర్వాత ఎక్కువ మంది భక్తులు దర్శించే పుణ్యక్షేత్రం యాదాద్రి. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకొని తమ మెుక్కులు చెల్లించుకుంటారు. అందుకు అనుగుణంగా దేవస్థానం అధికారులు చర్యలు చేపడుతున్నారు. కొండ పవిత్రకు భంగం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అనేక చర్యలు తీసుకుంటున్నారు.


తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లేవారు. సంప్రదాయ దుస్తుల్లోనే వెళ్లాల్సి ఉంటుంది. ఇదే నియమాన్ని యాదాద్రిల్లోనూ అమలు చేస్తున్నారు. యాదాద్రి ఆలయంలో నిత్య కళ్యాణం, బ్రేక్‌‌‌‌‌‌‌‌ దర్శనాలు, ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు తప్పని సరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ ఈవో ఆదేశాలు జారీ చేశారు. అయితే, ధర్మ దర్శనం (ఉచిత) క్యూలైన్లో వచ్చే భక్తులకు ఈ నియమం వర్తించదన్నారు. ఆలయంలో జూన్ 1 నుంచి నియమాలు కచ్చితంగా అమలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మగవారు తెల్లటి దుస్తులు, మహిళలు చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్‌‌‌‌‌‌‌‌, చీర, లంగావోణి వంటి దుస్తులు మాత్రమే ధరించాలని చెప్పారు. ఇవి కాకుండా వేరే దుస్తులు ధరిస్తే దర్శనానికి అనుమతి నిరాకరించనున్నారు. ఇక యాదాద్రి ఆలయంలో ప్లాస్టిక్‌పై కూడా నిషేదం విధించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్‌పై నిషేదం విధఇంచినట్లు ఆలయ ఈవో గతంలోనే వెల్లడించారు. భక్తులు కవర్లు వంటివి తీసుకురాకుండా ప్రత్మామ్నాయాలు చూసుకోవలాని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa