ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సమ్మర్ స్పెషల్ ట్రైన్స్, రూట్ల వివరాలివే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 19, 2024, 03:44 PM

సమ్మర్‌లో ట్రైన జర్నీ చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వటంతో పాటు కొందరు దూర ప్రాంతాలకు టూర్లు ఫ్లాన్ చేసుకుంటారు. దీంతో ట్రైన్లలో సాధారణంగానే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక ట్రైన్లు ఏర్పాటు చేశారు.


సంబల్‌పూర్‌-కాచిగూడ ట్రైన్ మే 27 నుంచి జూన్‌ 24 వరకు నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. సంబల్‌పూర్‌లో రాత్రి 9 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 3.30 గంటలకు రాయగడ చేరుతుందని చెప్పారు. ఉదయం 5.30 విజయనగరం , ఉదయం 7.20 దువ్వాడ గంటలకు చేరి.. ఏపీలోని వివిధ స్టేషన్ల మీదుగా రాత్రి 9.50 గంటలకు కాచిగూడ చేరుతుందని చెప్పారు.


తిరుగు ప్రయాణంలో మే 28 నుంచి జూన్‌ 25 వరకు నడిచే ట్రైన్ కాచిగూడలో రాత్రి 11.20 గంటలకు బయల్దేరి ఆ తర్వాతి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు దువ్వాడ చేరుతుందని వెల్లడించారు. విజయనగరం మధ్యాహ్నం 1.50 గంటలకు, రాయగడకు సాయంత్రం 4.05 గంటలకు చేరుతుందని.. సంబల్‌పూర్‌ రాత్రి 11.45 గంటలకు చేరుకోనున్నట్లు తెలిపారు.


సంబల్‌పూర్‌-ఎస్‌ఎంవీ బెంగళూరు స్పెషల్ ట్రైన్ మే 30 నుంచి జూన్‌ 27 వరకు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సంబల్‌పూర్‌లో సాయంత్రం 6.45 గంటలకు ట్రైన్ బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 4.55 గంటలకు దువ్వాడ చేరుతుందని అన్నారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి బయల్దేరి రాత్రి 11.30 గంటలకు బెంగళూరు చేరుకోనున్నట్లు వెల్లడించారు. తిరుగు ప్రయాణంలో ట్రైన్ జూన్‌ 1 నుంచి జూన్ 29 వరకు నడుస్తుందని అన్నారు.


ఈ ట్రైన్ బర్‌గార్‌రోడ్డు, బలంగీర్, టిట్లాగర్, కెసింగ, మునిగుడ, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, గూడూరు, రేణిగుంట, కాటపడి, జోలార్‌ పెట్టాయ్, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుందని స్పష్టం చేసారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa