ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్మల్ జిల్లాలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 23, 2024, 12:05 PM

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్స్ వద్ద బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ఘటనలో ఒకరు మృతి! 25 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ముస్కాన్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడపడం వల్ల బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్‌తో కలిపి 50 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న సారంగాపూర్‌ పెట్రోకార్‌ పోలీస్‌ సిబ్బంది కానిస్టేబుల్‌ మనోజ్, రాణాపూర్‌ గ్రామస్థులు క్షతగాత్రులను 108 వాహనాల్లో నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 25 మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ హైదరాబాద్ తరలిస్తుండగా అదిలాబాద్ పట్టణానికి చెందిన ఫర్హనా (28) అనే మహిళ మృతి చెందింది. క్షతగాత్రులను నిర్మల్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ఈ ఘటనలో ప్రస్తుతం నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.


కాగా బుధవారం రాత్రి 10:20 కు ఆదిలాబాద్ నుండి హైదరబాద్‌కు బస్సు బయలు దేరింది. అయితే బస్సు స్టార్ట్‌ అయినప్పటి నుంచే డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సుల నడుపుతున్నట్లు బాధితులు తెలిపారు. దీంతో గంటన్నరలోనే ప్రమాదం జరిగింది. డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa