ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్ట్రేలియాలో తెలంగాణ వ్యక్తి అనుమానాస్పద మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 24, 2024, 12:28 PM

ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ కు చెందిన అరటి అరవింద్ యాదవ్ (30) ఉద్యోగరీత్యా సిడ్నీలో స్థిరపడ్డాడు.గత సోమవారం ఇండియాకు వచ్చేందుకు కుటుంబ సభ్యులతో ఏర్పాట్లు చేసుకున్నారని బంధువులు తెలిపారు. విమాన టికెట్లు బుక్ చేసుకున్నాడని తెలిపారు. కారు వాష్ చేయించుకుని వస్తానని చెప్పిన అరవింద్‌ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు ఎంక్వైయిరీ చేస్తున్న క్రమంలో సముద్రంలో ఓ యువకుడి శవం లభ్యమైనట్టు స్థానిక పోలీసులు గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి ఆ శవం అరవింద్‌దేనని కన్ఫాం చేశారు. అతడిది హత్యా ? లేక ఆత్మహత్యా ?అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.షాద్‌నగర్‌ బీజేపీ నేత అరటి కృష్ణ ఏకైక కుమారుడు అరవింద్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa