ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య వేధింపులతో భర్త బలవన్మరణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 09, 2024, 10:13 PM

'భర్త వేధింపులను భార్య బలి... కట్టుకున్నవాడి టార్చర్ భరించలేక ఇల్లాలి ఆత్మహత్య...' ఇటువంటి వార్తలు మనం గతంలో విన్నాం.. చూశాం. కానీ భార్య వేధింపులకు ఓ భర్త బలయ్యాడు. భార్యతో పాటు ఆమె కుటుంబసభ్యులు వేధింపులకు గురి చేయటంతో తట్టుకోలేక అతడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నల్గొండ జిల్లా హుజూర్‌ నగర్‌ సీతారాంనగర్‌లో చోటుచేసుకుంది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్టిప్రోలు రంజిత్‌ కుమార్‌(32) ఫొటోగ్రాఫర్‌గా పనిచేసేవారు. ఆయన భార్య స్వప్న స్థానికంగా రేషన్‌ దుకాణం నడిపిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో గొడవలు జరుగుతున్నాయి. భార్య, ఆమె కుటుంబ సభ్యులు రంజిత్‌ కుమార్‌ను వేధింపులకు గురి చేశారు. వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa