హైదరాబాద్ పాతబస్తీలో వధశాలకు తరలిస్తున్న ఎద్దులను ఇద్దరు అక్కాచెల్లెళ్లు అడ్డుకున్నారు. వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దులను చంపుకు తింటారా అంటూ వాహనాలకు అడ్డుపడ్డారు. ఎద్దులను తరలిస్తున్న వాహనాల బానెట్ పైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. వాటిని తరలించకుండా అడ్డుపడ్డారు. అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
వివరాల్లోకి వెళితే.. మలక్పేట్లో రెండు వాహనాల్లో ఎద్దులను తరలిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న శ్రీ వనిత మైథిలి, సునితా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఎద్దులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. వాటిని స్లాటర్ హౌజ్కు తరలించటానికి వీళ్లేదని వాహనం డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడే ఉన్న చాలా మంది ముస్లింలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిట్ల దండకం అందుకున్నారు. అయినా అక్కాచెల్లెళ్లు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు వనిత వాహనం బానెట్పై కూర్చోగా.. సునితా వాహనం ముందు భాగంలో అడ్డుగా నిల్చుంది.
చాలా సేపు వారు అలాగే వాహనాన్ని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే కొందరు ముస్లింలు వారిని పక్కకు తప్పించి వాహనానికి దారిచ్చారు. ఆ తర్వాత 100కు డయల్ చేయగా పోలీసుల వారిని స్టేషన్కు తీసుకెళ్లి కంప్లైంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అక్కాచెల్లెళ్లు తాము 2012 నుంచి గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నామని చెప్పారు. చాలా ఆరోగ్యంగా మరో 15 ఏళ్లు వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దులను బక్రీద్ పండుగ ఉందని వధించటం తగదని చెప్పారు. తాము ఏ పార్టీకి, మతానికి వత్తాసుగా మాట్లాడటం లేదని.. జీవరక్ష పరమో ధర్మః అనే మాటకు కట్టుబడి గోవధకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పారు.
మనం బ్రతకటం కోసం ఇతర జీవుల ప్రాణాలు తీయటం సరైంది కాదన్నారు. తాము ఎద్దులను రక్షించే క్రమంలో కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కాచెల్లెళ్లు డిమాండ్ చేశారు. ఇక వీరు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పలువురు నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. వీరి ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ కొనియాడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa