ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతీయ ప్రయాణికులకి జర్మనీ ప్రభుత్వం భారీ ఊరట

international |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 12:14 PM

అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు జర్మనీ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. జర్మనీ మీదుగా మూడో దేశానికి వెళ్లే భారతీయ ప్రయాణికులు ఇకపై విడిగా 'ట్రాన్సిట్ వీసా' తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్స్ మధ్య జరిగిన భేటీ అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. సాధారణంగా భారతీయులు జర్మనీ విమానాశ్రయాల ద్వారా ఇతర దేశాలకు వెళ్లాలంటే ట్రాన్సిట్ వీసా తప్పనిసరి. తాజా నిర్ణయంతో పేపర్ వర్క్ తగ్గడమే కాకుండా ప్రయాణం మరింత వేగంగా, సులభంగా సాగుతుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఛాన్సలర్ మెర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది రెండు దేశాల ప్రజల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.ఛాన్సలర్ మెర్స్ తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్న క్రమంలో విద్య, పరిశోధన, ఉపాధి రంగాలపై ప్రత్యేక చర్చలు జరిగాయి. జర్మనీలో పెరుగుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్యను నేతలు స్వాగతించారు. భారతీయ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు జర్మనీ ఉద్యోగ మార్కెట్‌లో సులభంగా కలిసిపోయేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa