ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆడపిల్ల అని తెలిసి భార్యకు అబార్షన్.. పరిస్థితి విషమించి గర్భిణి మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 08:00 PM

అతడో ఉన్నత విద్యావంతుడు. పీహెచ్‌డీ స్కాలర్. సమాజంలో ఏది మంచో.. ఏది చెడో తెలిసిన వ్యక్తి. అయినా.. ముర్ఖంగా వ్యవహరించాడు. మూడోసారి కూడా తన భార్యకు ఆడపిల్లే అని తెలిసి అబార్షన్ చేయించాడు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవ్యతిరేకం అని తెలిసినా..చదువుకున్న మూర్ఖుడిగా పరీక్షలు నిర్వహించటంతో పాటు అబార్షన్ చేయించాడు. అయితే అబార్షన్ వికటించి తీవ్ర రక్తస్త్రావం కావటంతో భార్య మృతి చెందింది.


వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన సుహాసినిని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఎంజీనగర్‌ తండాకు చెందిన రత్నావత్‌ హరిసింగ్‌తో 2019లో వివాహం జరిపించారు. వీరికి నాలుగు, రెండేళ్ల వయస్సున్న ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు పిల్లల తర్వాత సుహాసిని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే అందుకు భర్త హరిసింగ్, అతడి తరపు బంధువులు ఒప్పుకోలేదు. తమకు వారసుడు (మగ పిల్లాడు) కావాలంటూ సుహాసినిపై ఒత్తడి తెచ్చారు. వారసుడు లేకపోతే మరో పెళ్లి చేసుకుంటానని హరిసింగ్ బెదిరించాడు. ఈ క్రమంలో ఆమె మూడోసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో కోదాడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఆమెకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.


మూడోసారి కూడా ఆడపిల్ల అని తెలియటంతో అబార్షన్ చేయించుకోవాలని ఆమెపై భర్త ఒత్తడి తెచ్చాడు. గత నెల 24న హుజూర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు హాస్పటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ హాస్పిటల్ మేనేజర్‌ ఖాసీంతో అబార్షన్‌ చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. హాస్పటిల్ నర్సు దేవరకొండ రాణితో ఆమెకు తన ఇంట్లోనే ఖాసీం అబార్షన్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆమెకు తీవ్ర రక్తస్త్రావం కావటంతో కోదాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. రెండ్రోజులు అక్కడ ట్రీట్‌మెంట్ తర్వాత పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే సుహాసిని కన్నుమూసింది.


మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు చివ్వెంల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతురాలి భర్త హరిసింగ్, షేక్‌ ఖాసీం, నర్సు దేవరకొండ రాణిలను ముందుగా అదుపులోకి తీసుకున్నారు. వీరికి సహకరించిన కోదాడలోని ఓ హాస్పిటల్ సిబ్బంది రణపంగు గోపి, షేక్‌ సైదులును కూడా అరెస్టు చేసారు. కాగా, లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించిన కోదాడలోని ప్రైవేటు ఆసుపత్రి నిర్వహకుడు పరారీలో ఉండగా అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పీహెచ్‌డీ స్కాలర్ అయి ఉండి ముర్ఖంగా భార్య చావుకు కారణమైన హరిసింగ్‌పై స్థానికులు మండిపడుతున్నారు. అతడు చదువుకున్న మూర్ఖుడు అంటూ ఫైరవుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa