అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు.. ఎస్ ఇప్పుడు అదే అనుమానం రేవంత్ రెడ్డి సర్కార్ ను చిక్కుల్లో పడేసింది..ఓ ఐఏఎస్ చేసిన నిర్వాకంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో రేవంత్ సర్కార్.తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖలో రాష్ట్రానికి చెందిన కొన్ని సంస్థలు 1400 కోట్ల రూపాయలకుపైగా జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డినట్లు వాణిజ్యశాఖ అనుమానం వ్యక్తం చేసింది. మొత్తం 11 సంస్థలు ఎగవేతకు పాల్పడినట్లు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ టీకే శ్రీదేవి గుర్తించారు. దీంతో జాయింట్ కమిషనర్ రవితో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. దాదాపు 1400 కోట్ల పన్ను ఎగవేత అనగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే యాక్షన్లోకి దిగి కేసును సీఐడీకి అప్పగించింది.మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, రాష్ట్ర జీఎస్టీ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వర రావు, జాయింట్ కమిషనర్ శివరాం ప్రసాద్, హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు లపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుపై సీఐడీ కూపీ లాగుతుండగానే సెంట్రల్ జీఎస్టీ ఎంట్రీ ఇచ్చింది. ఎగవేత మొత్తంలో సగం తమకు రావాలని.. పన్ను ఎగవేతదారుల పేర్లు ఇవ్వాలని లేఖ రాసింది. ఇక్కడే అసలు ట్విస్టు బయటపడటంతో ప్రభుత్వ పెద్దలు.. అధికారులు తలలు పట్టుకుంటున్నారు.భారీ మొత్తంలో పన్ను ఎగవేశారని ఫిర్యాదు చేసిన జాయింట్ కమిషనర్ రవిని సీఐడీ విచారించగా.. అప్పటి కమిషనర్ శ్రీదేవి చెబితేనే ఫిర్యాదు చేశానని, అంతకుమించి తనకేం తెలియదని జాయింట్ కమిషనర్ చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. పూర్తి సమచారం, ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం పై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారు.ఐఏఎస్ అధికారి టీకే శ్రీదేవి అనుమానం వ్యక్తం చేసిన వాటిలో కొన్ని ప్రభుత్వ సంస్థలు ఉండడంతో ఏం చేయాలో అర్ధం కాని స్థితిలో ఉన్నారు పోలీసులు.ఐఏఎస్ అధికారి అత్యుత్సాహంతో కేంద్ర సంస్థల వద్ద అడ్డంగా బుక్ అయ్యమని రాష్ట్ర వాణిజ్య శాఖలో పని చేసే అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర బెవరేజస్ కార్పోరేషన్, ట్రాన్స్ కో, ఎల్ఐసి, ఎన్ఎండిసీ తో పాటు పలు సంస్థలు జీఎస్టీ ఎగవేసినట్టు కేసులు పెట్టడం పై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది.సదరు ఐఏఎస్ చేసిన ఈ నిర్వహకంతో ఏం చేయాలో అర్ధం కాక ఆమెను అక్కడి నుంచి బదిలీ చేసినట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa