కాంగ్రెస్ ప్రభుత్వం రుణ మాఫీ విషయంలో గొప్పలు చెప్పుకొని ఆగస్ట్ 15న రాహుల్ గాంధీని తీసుకొని వచ్చి వరంగల్లో కృతజ్ఞత సభ పెడతాం అని రేవంత్ రెడ్డి ప్రకటించి రాహుల్ గాంధీని కూడా కలిశారు. కానీ రాహుల్ గాంధీ కృతజ్ఞత సభ మాత్రం రద్దయింది.రుణ మాఫీ విషయంలో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో ప్రజల్లో నుండి పాజిటివ్ రెస్పాన్స్ స్పందన రాకపోవడంతో సభ రద్దయినట్లు సమాచారం.రుణ మాఫీ వెనకున్న అసలు కారణాలు ఏంటి అని చూస్తే.40 లక్షల మంది రైతులకు రూ. 32 వేల కోట్లతో రుణ మాఫీ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించగా రెండు విడతల్లో కలిపి 17.75 లక్షల మందికి రూ. 12.22 వేల కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించింది. ఆగస్ట్ 15న చివరి మూడో విడతలో మరో రూ. 6 వేల కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.రుణ మాఫీకి చెప్పింది రూ. 32 వేల కోట్లు అయితే ఇచ్చింది, ఇవ్వబోయేది కలిపితే రూ. 18 వేల కోట్లు మాత్రమే కావడం.. చెప్పిన దాంట్లో సగం మంది రైతులకే రుణ మాఫీ కావడంతో రైతుల నుండి వ్యతిరేకత వస్తుంది.మరోవైపు జూన్ నెలలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం రైతుబంధు ఆపి రుణ మాఫీ పేరిట టైం పాస్ చేస్తున్నారు అనే భావనలో రైతాంగం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa