ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బషీరాబాద్‌లో మరో షాద్ నగర్ తరహా ఉదంతం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2024, 02:53 PM

కొడుకు ప్రేమించిన అమ్మాయితో వెళ్లిపోయాడని 3 నెలలుగా తల్లిని లాఠీలతో కొడుతున్న పోలీసులు.కూలీకి పోతేగానీ పూట గడవని ఆ కుటుంబాన్ని చిత్రహింసలు పెడుతున్న వికారాబాద్‌ పోలీసులు.వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గా గ్రామానికి చెందిన లోహడ నరేష్(17), కాశీంపూర్ గ్రామానికి చెందిన బాలిక(16) ప్రేమించుకొని 3 నెలల క్రితం ఇంట్లోనుండి వెళ్ళిపోయారు.అయితే బాలికను నరేష్ కిడ్నాప్ చేశాడని బాలిక కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. దీంతో పోలీసులు నరేష్ తల్లిని బషీరాబాద్ స్టేషన్‌కు పిలిచి కొడుకు అడ్రస్ చెప్పాలని కాళ్లు, చేతులు వాచిపోయేలా లాఠీ దెబ్బలు కొట్టారు.నరేష్ దొరికే వరకు నరేష్ తల్లి కళావతి రోజు పోలీస్ స్టేషన్‌కు రావాలని చెప్పడం, పోలీస్ స్టేషన్‌కు వచ్చాక ఆమెను కొట్టడం, బయట కూర్చోబెట్టడం మూడు నెలలుగా పోలీసులు ఇలానే చేపిస్తున్నరు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa