సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పెట్టుబడులపై విస్తృతంగా ప్రయత్నిస్తున్న రేవంత్.. ఫాక్స్కాన్ కంపెనీ ఛైర్మన్ యంగ్ లియూతో నేడు భేటీ కానున్నారు. అధికారిక పర్యటనతో పాటు పార్టీకి సంబంధించింన విషయాలపై కూడా సీఎం రేవంత్ అధిష్ఠానంతో చర్చించనున్నారు. పార్టీ అగ్రనేతలు, రాహుల్గాంధీ, మళ్లిఖార్జున ఖర్గే, సోనియా, ప్రియాంక తదితరులతో సీఎం భేటీ కానున్నట్లు తెలిసింది. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ హామీ నిలబెట్టుకున్న నేపథ్యంలో వరంగల్లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఫ్లాన్ చేస్తుంది. ఆ సభకు రావాల్సిందిగా రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్లు తెలిసింది.
ఇదే కాకుండా సీఎం రేవంత్ ఢిల్లీ టూర్లో మంత్రివర్గ విస్తరణ ప్రధాన అజెండా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ మంత్రుల సంఖ్య 18 కాగా.. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని 12 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. ఆరు బెర్తులు ఖాళీగా ఉండగా.. వాటి కోసం తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. మంత్రులుగా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, వివేక్, ప్రేమ్సాగర్రావు, మదన్మోహన్రావు, వాకిటి శ్రీహరి, సుదర్శన్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్రెడ్డి తదితరుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. తాను పార్టీలో చేరేటప్పుడే మంత్రి హామీ ఇచ్చారని రాజగోపాల్రెడ్డి చెబుతున్నారు. కాగా.. ముదిరాజ్ల నుంచి శ్రీహరి పేరును ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ సభ్యుడు సుదర్శన్రెడ్డికి ఎక్కువ అవకాశాలున్నాయి. అసలు ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి చూస్తే మల్ రెడ్డి రంగారెడ్డి రేసులో ఉన్నారు.
ఇవే కాకుండా ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. కొందరు చీఫ్ విప్లను కూడా పరిగణనలోకి తీసుకుని వివిధ సామాజికవర్గాల నుంచి ఎమ్మెల్యేలకు ఆయా పదవుకు కట్టబెట్టే ఛాన్స్ ఉంది. ఇక పీసీసీ అధ్యక్ష పదవిపై కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. రేవంత్ ప్రస్తుతం ఆ హోదాలో ఉండగా.. ఆయన పదవీ కాలం ముగిసింది. దీంతో ఈ పదవి కోసం బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్, మహేష్ గౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా గద్వాల జిల్లాకు చెందిన సరితా తిరుపతయ్యకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa