తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చినట్లు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. అమెరికా పర్యటనలో భాగంగా పలు కంపెనీలతో చర్చలు జరపినట్లు తెలిపారు. 19 సంస్థలతో రూ.31,500 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామని వివరించారు. ఈ పెట్టుబడుల ద్వారా తెలంగాణలో తర్వలోనే 30,750 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. దక్షిణ కొరియాలో దాదాపు 12 సంస్థలతో చర్చలు జరిపామని వివరించారు. ఏఐ, ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులపై పర్యటనలో చర్చించినట్లు తెలిపారు.
మూసీ పునరుజ్జీవం కోసం కొన్ని అధ్యయనాలు చేశామని.. మూసీ సుందరీకరణపై ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడితోనూ చర్చించినట్లు శ్రీధర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో బయోడిజైర్ సిటీని ఏర్పాటు చేయాలని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని కోరామని శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఒక సీఎం అమెరికా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి అని చెప్పారు. వివిధ కంపెనీలతో ఒప్పందాలు అమలు చేసేందుకు గాను రాష్ట్రంలో స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరు ముందుకు వచ్చినా ఆహ్వానిస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలే కాదని.. వారి బంధువులు వచ్చినా స్వాగతిస్తామని చెప్పారు. తెలంగాణలో కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొస్తామని శ్రీధర్ బాబు ప్రకటించారు.
తెలంగాణ యువతకు ఉపాధి లభించేలా చేసేందుకు ఎటువంటి భేషజాలు లేకుండా పని చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన మంచిని అలాగే కంటిన్యూ చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిశ్రమలలో 30 శాతానికి మించి గ్రౌండ్ కాలేదని ఆరోపించారు. దావోస్ పర్యటనలో చేసుకున్న 40 వేల కోట్ల పెట్టుబడులపై ఆయా సంస్థలతో అధికారులు ఇప్పటికి టచ్లో ఉన్నారని చెప్పారు. ఫాక్స్ కాన్ సంస్థ తెలంగాణను వీడి ఇతర రాష్ట్రానికి తరలి వెళ్తున్న్నదని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఫాక్స్ కాన్ సంస్థ ఎక్కడికి పోవడం లేదని చెప్పారు. కొన్ని కంపెనీలు వారి విధానాల ప్రకారం ప్లాంట్లను విస్తరిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa