ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జల్సాలకు అలవాటుపడి బైక్లల చోరీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 18, 2024, 09:25 AM

జల్సాలకు అలవాటుపడి ద్విచక్రవాహనాలు చోరీలు చేస్తున్న రెండు బృందాలను ఓయూ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇందులో ఇద్దరు మైనర్లను జువైనల్ హోంకు తరలించారు. పరారీలో మరో మహి ళ ఉన్నది. వారి నుంచి 13 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఓయూ ఏసీపీ కార్యాల యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ గ్యార జగన్ వివరాలను వెల్లడించారు. తార్నాకలో ఉండే యాసిన్ అలీ సిద్దిఖీ ఈనెల 4న రాత్రి 12.30 గంటలకు స్వగ్రామానికి వెళ్తూ బైక్ను (డీఎల్ 3 ఎస్ఎల్ 2191)ను తార్నాక మెట్రో స్టేషన్ వద్ద పార్క్ చేశాడు. తిరిగి 6న ఉదయం 8గం టలకు రాగా, బైక్ కనిపించలేదు. పోలీసులకు ఫిర్యా దు చేయగా.. సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను నిజాంపేటలో అరెస్టు చేశారు. ఏపీ, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన దివ్వల లాజరు అలి యాస్ రాము, కోనేటి రాజేశ్ స్నేహితులు. వారిద్దరూ ఉపాధి నిమిత్తం హైదరాబాద్కు వచ్చి, చిన్నచిన్న కేసుల వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ గ్యార జగన్, చిత్రంలో సీఐ రాజేందర్, ఎస్సై రవికుమార్ఉద్యోగాలు చేసేవారు. జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం బైక్లను దొంగతనాలు చేయడం ప్రారం భించారు. ఇందులో భాగంగా తార్నాకలో ఒక బైక్, కాకినాడలో మరో బైకు చోరీ చేసి.. విక్రయించే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. 
గత నెల 21న రాత్రి తొమ్మిది గంటల సమ యంలో మహమ్మద్ యాసిన్ మాణికేశ్వరీనగర్ మెయిన్ రోడ్డు హెచ్పీ పెట్రోల్ బంకు పక్కన ఉన్న హిమాయత్అలీ మసీదుకు వచ్చి, తన యాక్టివా (టీ ఎస్ 09 ఈఏ 9075)ను అక్కడే నిలిపి, లోపలికి వెళ్లాడు. ప్రార్థనలు  ముగించుకుని రాగా వాహనం కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా ఇద్దరు మైనర్లు, వ్యక్తిని అదు పులోకి తీసుకున్నారు. మల్లాపూర్కు చెందిన అబ్దుల్ సమద్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. తన భార్య సాహెరా, కొడుకు మైనర్, అతడి స్నేతుడు (మైనర్)లతో కలిసి బైక్లు చోరీలు చేస్తున్నట్టు ఒప్పు కున్నాడు. ఇందులో ఇద్దరు మైనర్లు, సమదు అదు పులోకి తీసుకుని.. వారినుంచి 11 ద్విచక్రవాహనా లను స్వాధీనం చేసుకున్నారు. మైనర్లను జువైనల్ హోంకు తరలించారు. పరారీలో ఉన్న సాహెరా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సమావేశంలో సీఐ రాజేందర్, ఎస్సై రవికుమార్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa